రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
జమ్ములమడుగులో టీడీపీకి షాక్
29 Jan 2019 6:58 PM
ఆదినారాయణరెడ్డి అనుచరులు వైయస్ఆర్సీపీలో చేరిక
హైదరాబాద్: వైయస్ఆర్ జిల్లాజమ్ముల మడుగులో అధికార తెలుగు దేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీకి చెందిన నేతలు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అనుచరులు టీడీపీ వీడి వైయస్ఆర్సీపీ గూటికి చేరారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అనుచరులు ముని రాజారెడ్డి, బొందల గుంట సుబ్బయ్య, స్టాల్ పీరా సోదరులు, పెద్ద ముడియం, ఈశ్వర్రెడ్డి, దస్తగిరిరెడ్డి వైయస్ఆర్సీపీలో చేరారు.
వీరికి వైయస్ జగన్ కండువాలు కప్పి వైయస్ఆర్సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి, జమ్ములమడుగు ఇన్చార్జ్ డాక్టర్ సుదీర్రెడ్డి, తదితరులు ఉన్నారు.