‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
కూన రవికుమార్తో ప్రాణభయం ..రక్షణ కల్పించాలి
13 Feb 2019 11:39 AM
పోలీసులకు ఫిర్యాదు చేసిన వైయస్ఆర్సీపీ కార్యకర్త శివ కుమార్
తమ్మినేని ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
శ్రీకాకుళం: ప్రభుత్వ విప్ కూన రవికుమార్ వైయస్ఆర్ సీపీ కార్యకర్త గంగిరెడ్ల శివకుమార్పై ఫోన్లో బెదిరింపులకు పాల్పడటంతో పార్టీ శ్రేణులు అండగా నిలబడ్డాయి. వైయస్ఆర్ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేనీ సీతారాం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ నుంచి బస్టాండ్, మార్కెట్, పోస్టాఫీసు, జూనియర్ కళాశాల మీదుగా పోలీసు స్టేషన్ వరకు సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. విప్ కూన రవికుమార్ డౌన్ డౌన్.. దౌర్జన్యం నశించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎస్ఐ బాలరాజు లేరని హెచ్సీ బాదుషా చెప్పడంతో అక్కడే బైఠాయించారు.
ఎస్పీ, ఎస్ఐలతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం హెడ్ కానిస్టేబుల్కు ఫిర్యాదునిచ్చి రసీదును తీసుకున్నారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్తో ప్రాణభయం ఉందని, తనకు రక్షణ కల్పించాలని శివకుమార్ పోలీసులను కోరారు. అనంతరం మహారాజా మార్కెట్కు వెళ్లి బహిరంగ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తమ్మినేనీ సీతారాం మాట్లాడుతూ రవికుమార్ వ్యవహారం ఆరిపోయే ముందు వెలుగుతున్న దీపంలా ఉందని విమర్శించారు. ఓటమి భయంతోనే బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికిపోయినట్లు.. ఇప్పుడు రవికుమార్ అడ్డంగా బుక్కయ్యారని పేర్కొన్నారు.
అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అయినా బీసీ కార్పొరేషన్ రుణం ఇప్పించాననడం విప్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు హానితలపడితే సహించేది లేదన్నారు. ఎంపీపీ ప్రతినిధి సువ్వారి గాంధీ మాట్లాడుతూ రౌడీరాజకీయాలు చేసి లబ్ధిపొందాలంటే పొందూరు మండలంలో కుదరదని చెప్పారు.
వైయస్ఆర్ సీపీ నాయకులు పప్పల వెంకటరమణమూర్తి మాట్లాడుతూ గొయ్యితీసి పాతేసే రాజకీయాలు తమ వద్ద చెల్లవన్నారు. చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు కోరుకొండ సాయికుమార్ మాట్లాడుతూ దిగుజారుడు రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. మాజీ సర్పంచ్ గంగిరెడ్ల ఉమాదేవి మాట్లాడుతూ పొందూరులో బాలకృష్ణ డైలాగులు చెబితే జడిసేవారు లేరన్నారు. బాదితుడు శివకుమార్ మాట్లాడుతూ తమ్మినేనీ సీతారాం, సువ్వారి గాంధీ అడుగుజాడల్లో నడుస్తున్నానని, తానెవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గాడు నాగరాజు, నాయకులు లోలుగు కాంతారావు, బీఎల్ నాయుడు, యతిరాజుల జగన్నాథం, పెద్దింటి వెంకట రవిబాబు, పప్పల దాలినాయుడు, పప్పల అప్పలనాయుడు, కూన కిరణ్, తమ్మినేని మురళీకృష్ణ, బొనిగి రమణమూర్తి, అనకాపల్లి గోవిందరావు, పోతురాజు సూర్యారావు, కొంచాడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.