కొన‌సాగుతున్న వైయ‌స్ఆర్ పెన్ష‌న్ కానుక పంపిణీ

అమ‌రావ‌తి:  క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ ఏపీలో సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు ఆగ‌డం లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రమంతా వైయ‌స్ఆర్ పెన్ష‌న్ కానుక పంపిణీ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. రాష్ట్రంలో 61.45 ల‌క్ష‌ల పెన్ష‌న‌ర్ల కోసం రూ.1,486.81 కోట్లు ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. వీటిని 2.66 ల‌క్ష‌ల మంది వాలంటీర్ల ద్వారా ల‌బ్ధిదారుల‌కు పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్ష‌న్లు అంద‌జేస్తున్నారు. ఇంటివ‌ద్ద‌కే పింఛ‌న్ సొమ్ము చేరుతుండ‌టంతో ల‌బ్ధిదారులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Back to Top