రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
జగన్పై హత్యాయత్నం కేసులో డ్యాకుమెంట్లు ఇప్పించాలి
08 Jan 2019 4:20 PM
కోర్టును ఆశ్రయించిన ఎన్ఐఏ
విశాఖపట్నంః వైయస్ఆర్సీపీ అధ్య క్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఏపీ పోలీసులు సహకరించకపోవడంతో జాతీయదర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం కోర్టును ఆశ్రయించింది. ఈ హత్యాయత్నం కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇప్పించాలని ఎన్ఐఏ కోర్టులో మెమో దాఖలు చేసింది.
ఈ కేసును విజయవాడ కోర్టుకు బదలాయించాలని కోరింది. నిందితుడు శ్రీనివాసరావును కూడా కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ విమానాశ్రయంలో గతేడాది అక్టోబర్ 25న ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం ఘటనమీద దర్యాప్తును హైకోర్టు ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ)కు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎన్ఐఎ జనవరి 1న ఎఫ్ఐఆర్ను నమోదు చేసి దర్యాప్తు కూడా మొదలుపెట్టింది. విచారణలో భాగంగా ఏపీ పోలీసులు సహకరించకపోవడంతో ఎన్ఐఏ అధికారులు కోర్టును ఆశ్రయించారు.