సిఎం ఉన్నారిక్కడ.. నోరు పారేసుకోవద్దు

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌
 

తాడేపల్లి: రివర్స్ టెండర్లతో రూ.2 వేల కోట్ల ప్రజాధనం ఆదాచేసిన సిఎం ఉన్నారిక్కడ...నోరు పారేసుకోవద్దు అంటూ వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతిపక్షాలను హెచ్చరించారు. టీడీపీ, దాని బానిసలకు లాక్ డౌన్ తో మతి భ్రమించినట్టుంది. కరోనా కిట్ల ధరలపై అరిచి భంగపడ్డారు. కిట్ల తయారీ కంపెనీలో వాటాలున్నాయని, డిస్టిలరీల నుంచి కమీషన్లు తీసుకున్నారని మంటలు రాజేస్తున్నారంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.  

Back to Top