అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా విశాఖ‌

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌: రాష్ట్ర పరిపాలనా రాజధాని విశాఖను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్‌ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు బుధ‌వారం ఆయ‌న ట్వీట్ చేశారు. రూ. 1,200 కోట్లతో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ ద్వారా పలు ఆకర్షణీయ ప్రాజెక్టులు ఏర్పాటు కాబోతున్నాయ‌ని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. 

ఒక్క సలహా అయినా ఇచ్చావా చంద్రం?
ఒక ముఖ్యమంత్రి పదేళ్లలో చేయగలిగే పనులను వైయ‌స్ జగన్ గారు రెండేళ్లలో అమలు చేశారు.14 ఏళ్లు సిఎంగా వెలగబెట్టానని డబ్బా కొట్టుకునే నీవు ఈ రెండేళ్లలో ప్రజలకు పనికొచ్చే ఒక్క సలహా అయినా ఇచ్చావా చంద్రం? స్టేలు, బెయిళ్లు సంపాదించడం మినహా అంటూ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

Back to Top