రైతు ప‌క్ష‌పాతిన‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మ‌రోసారి నిరూపించుకున్నారు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

విశాఖ‌: రైతుల కోసం ఎంత చేసినా తక్కువేనని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ గారు ఎప్పుడూ చెబుతుంటారు. అందుకు అనుగుణంగానే 2021-22 రాష్ట్ర బడ్జెట్ లో రైతు పథకాలకు అత్యధికంగా రూ.11,210.80 కోట్లు కేటాయించి తాను రైతు పక్షపాతినని మరోసారి నిరూపించుకున్నారని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ప్రజా క్షేత్రంలో వాతలు పెట్టించుకుని రాష్ట్రంలో కాలుమోపే ధైర్యం లేని తండ్రీకొడుకులను ఎన్ని జాకీలు పెట్టి లేపాలని చూసినా ప్రయోజనం ఉండదు. గారడీ విద్యలతో కొన్నాళ్లు నెట్టుకురాగలిగినా చివరకు జనాగ్రహ జ్వాలల్లో మాడి మసై పోవాల్సిందే. కాలగర్భంలో కలిసి పోక తప్పదు అంటూ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

Back to Top