బడ్జెట్‌ పత్రానికి ప్రామాణికత 

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి

తాడేపల్లి: సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో బడ్జెట్‌ పత్రానికి ప్రామాణికత వచ్చిందని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కోన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశారు. గతంలో వార్షిక బడ్జెట్‌ టీడీపీ మేనిఫెస్టో లాగే అంతా ఉత్తుత్తి వ్యవహారంగా ఉండేదన్నారు. ప్రణాళిక కేటాయింపులతో ప్రజల జీవన ప్రమాణాలు మారిపోతాయని ఎల్లోమీడియా వారం రోజుల భజన చేసేదన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపించేది, ఇప్పుడలా కాదన్నారు. బడ్జెట్‌ పత్రానికి ప్రామాణికత వచ్చిందని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 
 

Back to Top