విశాఖ: టీడీపీ అధినేత చంద్రబాబు మేకవన్నె పులి, గుంటనక్క అని గతంలోనే ఎన్టీ రామారావు సంబోధించారని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. మానవహక్కుల సమావేశానికి రాని చంద్రబాబు, యనమల రాకపోవడంపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'ఈ మేకవన్నె పులి, ... ఈ గుంట నక్క" అని ఎన్టీఆర్ పేర్కొన్న చంద్రబాబు నాయుడ్ని, వెన్నుపోటుకు స్పీకర్గా ఉపయోగపడిన యనమలను మానవహక్కుల సమావేశానికి రమ్మంటే వారు ఎందుకు వస్తారు చెప్పండి? తమను మానవులుగా గుర్తించటం వీరిద్దరికీ ఏనాడూ ఇష్టముండదు మరి!' అని విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.