వైద్య ఆరోగ్య సిబ్బందికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

 
విశాఖ‌: ప్రాణాలకు తెగించి కోవిడ్‌ కోవిడ్ బాధితులకు సేవలు అందిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి భరోసానిస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులెవరైనా కోవిడ్‌తో మృతి చెందితే వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నారని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

రాష్ట్రంలో ఆటో, క్యాబ్‌ డ్రైవర్ల కష్టాలను తన పాదయాత్రలో నేరుగా చూసి తెలుసుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు వైఎస్సార్ వాహనమిత్ర పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. వరుసగా మూడో ఏడాది 2.48 లక్షల మందికి రూ.248.47 కోట్ల నగదును ఈరోజు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశార‌ని మ‌రో ట్వీట్ చేశారు.

Back to Top