కేఏ పాల్ కన్నా పెద్ద నాయకునివా లోకేశం? 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

విశాఖ‌:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడి తీరును వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు.  ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అది తన వల్లే అంటాడు చంద్రబాబు.  కలాంను రాష్ట్రపతిగా, వాజ్ పేయని ప్రధానిగా చేసింది తానేనంటాడు. ఆ జబ్బు 'పప్పు'రత్నానికి అంటింది. ఇంటర్ పరీక్షల వాయిదా తనవల్లే అంటూ డప్పు కొడుతున్నాడు. కేఏ పాల్ కన్నా పెద్ద నాయకునివా లోకేశం?  అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

రాష్ట్ర పరిపాలనా రాజధాని విశాఖ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. సాగర నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే పలు ప్రాజెక్టులపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ గారి నాయకత్వంలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్‌లో పేర్కొన్నారు.

Back to Top