రఘురామకృష్ణంరాజుకు నైతిక విలువలు లేవు

ఎంపీ నందిగం సురేష్‌

గుంటూరు:  ఎంపీ రఘురామకృష్ణంరాజుకు నైతిక విలువలు లేవని వైయస్‌ఆర్‌సీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ విమర్శించారు. ఆయన చిలుక జోష్యం చెప్పుకుంటే బాగుంటుందని సూచించారు. నరసాపురం నియోజకవర్గం వదిలి ఢిల్లీలో ఏం చేస్తున్నారని రఘురామకృష్ణం రాజును ప్రశ్నించారు. ప్రజల సమస్యలు తెలుసుకోకుంఆ చెట్టు కింద కూర్చుని పిట్టకథలు చెప్తున్నారని విమర్శించారు. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం దమ్ము కాదని పేర్కొన్నారు.
 

Back to Top