చంద్రబాబు మూడు గంటల బ్రేక్‌ ఫాస్ట్‌ దీక్ష చేశారు

ఎమ్మెల్సీ సీ.రామచంద్రయ్య

అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నిన్న మూడు గంటల పాటు బ్రేక్‌ ఫాస్ట్‌ దీక్ష చేశారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ సీ.రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. సంక్షేమం అనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదన్నారు.  అధికార పార్టీపై బురద జల్లడమే చంద్రబాబు లక్ష్యమని మండిపడ్డారు. చంద్రబాబు గాలి మాటలు చెబుతూ జూమ్‌లో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. మోదీని విమర్శించాలంటే చంద్రబాబుకు భయమని చెప్పారు.
 

Back to Top