రాజ‌కీయ ఉనికి కోస‌మే దేవినేని ఉమా ఆరోప‌ణ‌లు

ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్

విజ‌య‌వాడ‌:  రాజ‌కీయ ఉనికి కాపాడుకునేందుకు టీడీపీ నేత దేవినేని ఉమ త‌న‌పై అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ పేర్కొన్నారు. ఐదేళ్ల టీడీపీ పాల‌న‌లో అన్నింటిని దోచుకున్న ఉమా..ఇప్పుడు త‌న‌పై అక్ర‌మ మ‌ద్యం, ఇసుక ర‌వాణా చేస్తున్న‌ట్లు త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఉమాకు ద‌మ్ముంటే చేసిన ఆరోప‌ణ‌ల‌ను రుజువు చేయాల‌ని స‌వాలు విసిరారు. తీరు మార్చుకోక‌పోతే ఉమ‌కు ప్ర‌జ‌లే గుణ‌పాఠం చెబుతార‌ని కృష్ణ‌ప్ర‌సాద్ హెచ్చ‌రించారు. 

 

Back to Top