అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు టీడీపీ ద్వంద్వ విధానాన్ని అవలంభించిందని శాసన సభ విప్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. టీడీపీలో అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అసెంబ్లీలో టీడీపీ వాకౌట్ చేసి..కౌన్సిల్లో నిరసన చేపట్టడం ఏంటోనని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం కాబట్టీ ఈ రోజు జరిగింది..ఉమ్మడి సమావేశం, టీడీపీ చేస్తే పూర్తిగా నిరసన కార్యక్రమం చేపట్టాలని, లేదంటే గవర్నర్ ప్రసంగాన్ని హాజరు కావాలన్నారు.