108 వాహ‌నాన్ని ప్రారంభించిన‌ ఎమ్మెల్యే రోజా

  తిరుప‌తి : న‌గ‌రి  పుత్తూరు పున్నమి సర్కిల్‌లో వైయ‌స్సార్ విగ్ర‌హం వ‌ద్ద 108,104 అంబులెన్సు వాహ‌నాల‌ను ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా 108 వాహ‌నాన్ని రోజా  స్వ‌యంగా న‌డిపారు.   రాష్ట్రంలో అత్య‌వ‌స‌ర సేవ‌లందించే 108,104 వాహ‌నాల‌ను అత్యాధునిక సౌక‌ర్యాల‌తో జూలై 1న 1088 అంబులెన్సు స‌ర్వీసుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఒకేసారి ప్రారంభించిన సంగ‌తి తెలి‌సిందే. 

Back to Top