ఎమ్మెల్సీ క‌రీమున్నిసా పార్థివ‌దేహానికి ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు నివాళి

విజ‌య‌వాడ‌: కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నిసా  పార్థివదేహానికి ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు నివాళుల‌ర్పించారు. క‌రిమున్నిసా నిన్న రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. అజిత్ సింగ్ నగర్ లో ఎమ్మెల్సీ కరీమున్నిసా పార్థివదేహానికి  ఎమ్మెల్యే మల్లాది విష్ణు పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చి ధైర్యం చెప్పారు. 

Back to Top