బాబు ఖాతాలో ఎంతుందో తేల్చాలి

ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి
 

గుంటూరు: చంద్రబాబు మాజీ పీఎస్‌ ఇంట్లోనే రూ. 2 వేల కోట్లుంటే.. బాబు ఖాతాలో ఎంతుందో తేల్చాల్సిన అవసరం ఉందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలను భ్రష్టు పట్టించిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. 1994 నుంచే డబ్బుతో రాజకీయాలు చేసిన బాబు.. ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు ఆద్యుడు అని అన్నారు. బాబు అవినీతిలో పవన్‌ కల్యాణ్‌కు కూడా భాగం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు.
 

Back to Top