ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డు

 ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

విశాఖ: ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డు పడుతున్నారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే చంద్రబాబుకు ఎందుకంత కడుపు మంట అని ప్రశ్నించారు. విశాఖకు కేవలం పెళ్లి పనుల కోసమే వచ్చాడని, ఈ అంశాన్ని కూడా రాజకీయంగా మలుచుకునేందుకు చంద్రబాబు ప్లాన్‌ చేశారన్నారు. ఐదేళ్లలో ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగితే ప్రజలు ఎందుకు వలసలు వెళ్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ఏనాడు చంద్రబాబు ఆలోచన లేదు.

Back to Top