దొంగల లెక్కలు చెప్తూ బాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు

ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు: పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు కొత్త లెక్కలు చెప్తున్నారని ఎమ్మెల్యే కాకాణి  గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. దొంగల లెక్కలు చెప్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.  ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసినా చంద్రబాబుకు ఫలితం రాలేదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఒకే పార్టీ 86 శాతం సాధించడం ఇదే ప్రథమం అన్నారు. మున్సిపాలిటీలతో పాటు తిరుపతి ఉప ఎన్నికలోనూ మాదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
 

Back to Top