మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి విశ్వరూప్
18 Aug 2020 3:43 PM
తూర్పు గోదావరి: గోదావరి నదీ వరద ప్రభావిత ప్రాంతమైన కోనసీమను మంత్రి పెనిపే విశ్వరూప్ పరిశీలించారు. వరద ఉధృతి కారణంగా చాలా ప్రాంతాల్లో కాజ్వేలు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి నీరు చేరింది. ఈ ప్రాంతాల్లో మంత్రి పర్యటించి సహాయక చర్యలను, పునరావాస కేంద్రాలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 68 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. 6 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎన్టీ ఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగినట్లు పేర్కొన్నారు. గోదావరి ప్రాంత పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశ్వరూప్ సూచించారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట లో ముంపు ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు.