పేదవాడికి అండగా నిలిచిన బడ్జెట్‌ ఇది

మంత్రి వేణుగోపాలకృష్ణ
 

అమరావతి: ఇవాళ సభలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పేదవాడికి అండగా నిలుస్తుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. విద్య కోసం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన బడ్జెట్‌ ఇదన్నారు. బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలకు కూడా మేలు చేసే బడ్జెట్‌ అన్నారు. బీసీ వర్గాలకు రూ.29 వేల కోట్లకు పైగా బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. బీసీ వర్గాలకు మేలు చేసే బడ్జెట్‌ అని మంత్రి వేణుగోపాలకృష్ణ కొనియాడారు.

 

Back to Top