సీఎం వైయ‌స్‌ జగన్‌ సంక్షేమ పాలనను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు 

మంత్రి శంకర్‌నారాయణ
 

అనంతపురం: సీఎం వైయ‌స్‌ జగన్‌ సంక్షేమ పాలనను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని  మంత్రి శంకర్‌నారాయణ మండిప‌డ్డారు. టీడీపీ నేతలకు మతిభ్రమించిందని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.  మంగళవారం మంత్రి శంక‌ర్ నారాయ‌ణ‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎల్లోమీడియా ద్వారా టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. నేతన్న నేస్తం ద్వారా చేనేత కార్మికులను ఆదుకుంటున్నామని శంకర్‌నారాయణ పేర్కొన్నారు. 

రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసం చేయలేదా? బాబు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు చేసుకున్నారని, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, కాలువ శ్రీనివాస్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత జగన్‌దే అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పక్షపాతిగా సీఎం వైయ‌స్ జగన్ వ్యవహరిస్తున్నారని చెప్పారు. 

Back to Top