పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ మా ప్రభుత్వ విధానం
21 Mar 2022 12:16 PM
మంత్రి బొత్స సత్యనారాయణ
అమరావతి: అనధికారిక నీటి కనెక్షన్లపై ప్రభుత్వం కఠిన ^è ర్యలు తీసుకుంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ చట్టప్రకారం నిబంధనల మేరకు నీటి కనెక్షన్లు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రతీ ఇంటికి కొళాయి కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వ విధానమన్నారు. జీవోలకు సంబంధం లేకుండా విచ్చలవిడిగా దోపిడీ చేయడం ఈనాడు విధానమా అని ప్రశ్నించారు. వ్యవస్థను పటిష్టం చేసేలా పత్రికలు వ్యవహరించాలని మంత్రి సూచించారు.
మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకా ఏమన్నారంటే..
ఈ ప్రభుత్వం పేదలను అన్యాయం చేస్తున్నట్లు ఓ పత్రికలో కధనం వచ్చింది. మాది పేదల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వం. అటువంటి మా ప్రభుత్వం మీద ఓ వర్గం మీడియా బురదజల్లే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడో ఒకచోట జరిగిన చిన్న సంఘటనలను సాకుగా చూపుతూ.. రాష్ట్రమంతా అవి జరిగినట్లు, జరుగుతున్నట్లు ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది.. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉండాలనేది మా ప్రభుత్వ విధానం. అనధికారికంగా కుళాయి కనెక్షన్ వద్దు.. అధికారికంగా కుళాయి కనెక్షన్ తీసుకోవాలని ప్రజలను కోరుతున్నాను. చట్టానికి సంబంధం లేకుండా, ఎక్కడో అనధికారికంగా జరిగే సంఘటనలకు ఈనాడు పత్రిక మద్దతు పలుకుతుందా..?. ఎక్కడైనా వ్యవస్ధలను పటిష్టం చేయాలని కోరతారు. కుళాయి కనెక్షన్ రేట్లు అధికంగా ఉన్నాయని ఎవరైనా భావిస్తే.. వారి సమస్యలను స్ధానిక సంస్దల దృష్డికి తీసుకెళ్లవచ్చు. అలాకాకుండా, ప్రజలను గందరగోళానికి గురి చేసే విధంగా మీడియా కథనాలు రాయకూడదు.
పన్నుల కట్టకపోతే జప్తులు చేయటం అన్నది ఎప్పటినుంచో ఉంది. ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. ప్రజలని ఇబ్బంది పెట్టి జప్తు చేయడం ప్రభుత్వం ఉద్దేశంకానేకాదు. స్ధానిక సంస్ధలను సక్రమంగా నిర్వహించాలంటే పన్నులు సక్రంమగా చెల్లించాలి కదా..?. పన్నులు కట్టకపోతే.. చర్యలు తీసుకున్న ఘటనలు గత ప్రభుత్వాల హయాంలో కూడా ఎన్నో జరిగాయి. కానీ, అప్పుడు ఎందుకు ఇలాంటి వార్తలు ఈనాడు రాయలేదు. అంటే, ఆ పత్రిక మోటివ్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. బలవంతంగా పన్ను వసూలు చేయాలనిగానీ.. ప్రజలను ఇబ్బంది పెట్టాలనిగానీ.. ప్రభుత్వం ఎక్కడా ఆదేశించలేదు.