గ్యాస్‌ ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితి 

మంత్రి అవంతి శ్రీనివాస్‌
 

విశాఖ: గ్యాస్‌ ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితి నెలకొందని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పద్మనాభనగర్‌లోని ఓ బాధితుడి ఇంట్లో నిద్ర చేసిన మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ..  ప్రజలతో పాటు గ్రామంలో నిద్రించామని ఆయన తెలిపారు. బాధితులకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.
 

Back to Top