రథోత్సవంలో పాల్గొన్న మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌

నెల్లూరు:మూలాపేట మూలస్థానేశ్వర స్వామి రథోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ రథోత్సవంలో మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ పాల్గొని మొక్కలు తీర్చుకున్నారు. మంత్రి అనిల్‌ కుమార్‌ స్వామివారిని భజాలపై మోసి రథాన్ని లాగారు. రాష్ట్ర ప్రజలందరికీ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని, ముఖ్యంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.
 

Back to Top