త్వరలోనే పది పరీక్షల షెడ్యూల్‌ విడుదల

లాక్‌డౌన్‌ ముగిసిన రెండు వారాల తరువాత పరీక్షలు

మంత్రి ఆదిమూలపు సురేష్‌

తాడేపల్లి: పదో తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ త్వరలోనే విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ ముగిసిన రెండు వారాల తరువాత పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.

Back to Top