అర్హులు అందరికి సంక్షేమ ప‌థ‌కాలు

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో పివిఎల్ నరసింహారాజు

ప‌శ్చిమ గోదావ‌రి: అర్హులంద‌రికీ సంక్షేమ ఫ‌థ‌కాలు అందించ‌డ‌మే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ల‌క్ష్య‌మ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త పివిఎల్ నరసింహారాజు అన్నారు.  పాలకోడేరులో బుధ‌వారం పివిఎల్ నరసింహారాజు గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ప్ర‌తి ఇంటికి వెళ్లి  ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలను అడిగి తెలుసుకుంటున్నారు. స్థానికుల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకొని ప‌రిష్కార మార్గం చూపుతున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని మ‌ళ్లీ ఆశీర్వ‌దించాల‌ని న‌ర‌సింహ‌రాజు అభ్య‌ర్థించారు.

Back to Top