కురిచేడు ఘ‌ట‌న బాధాక‌రం

ద‌ర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్‌
 

ప్ర‌కాశం:  ప్రకాశం జిల్లా కురిచెడులో  శానిటైజర్ తాగి ఏకంగా 9 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘ‌ట‌న బాధాక‌ర‌మ‌ని ద‌ర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ పేర్కొన్నారు. శానిటైజ‌ర్ ఎక్కువ  మోతాదులో తాగ‌డం వ‌ల్లే ఘోర ప్ర‌మాదం జ‌రిగింద‌న్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని ఎమ్మెల్యే తెలిపారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. శానిటైజ‌ర్‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌ని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top