నాడు-నేడు ప‌నులు ప‌రిశీలించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ‌

విజ‌య‌వాడ‌: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీ పాఠశాలలో గురువారం ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి నాడు-నేడు ప‌నుల‌ను ప‌రిశీలించారు. త‌ర‌గ‌తి గ‌దికి వెళ్లి అక్క‌డ ఏర్పాటు చేసిన ఆధునీకీక‌ర‌ణ చేసిన సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించారు. విద్యార్థుల‌తో క‌లిసి త‌ర‌గ‌తి గ‌దిలో కూర్చొని, అక్క‌డి వ‌స‌తుల‌ను అడిగి తెలుసుకున్నారు. కాసేప‌ట్లో జ‌గ‌న‌న్న విద్యా కానుకను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పంపిణీ చేయ‌నున్నారు.

తాజా వీడియోలు

Back to Top