14న తిరుప‌తికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రాక‌‌

 ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు

చిత్తూరు:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ నెల 14వ తేదీ తిరుప‌తికి రానున్నారు.  తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక  ప్రచార స‌భ‌లో అశేష ప్ర‌జానీకాన్ని ఉద్దేశించి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించ‌నున్నారు. సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన‌బోయే  మీటింగ్ స్థలాన్ని వైయ‌స్ఆర్ సీపీ జిల్లా ఇన్‌చార్జ్‌, టీటీడీ చైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డి , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ప్ర‌భుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, త‌దిత‌రులు ప‌రిశీలించారు. 

Back to Top