ప్రీ ప్రైమరీ క్లాసులు నిర్వహించాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నాం

నూతన విద్యా విధానంపై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష

మీడియాతో మంత్రి ఆదిమూల‌పు సురేష్‌

అమరావతి : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న మెజారిటీ అంశాలు  ఉన్నాయ‌ని మంత్రి ఆదిమూల‌పు సురేష్ పేర్కొన్నారు.  ప్రీ ప్రైమరీ క్లాసులు నిర్వహించాలని మనం ముందుగానే నిర్ణయం తీసుకున్నామ‌ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చట్టం అమలు, ప్రయోజనాలపై చర్చించారు.  స‌మావేశం వివ‌రాల‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాకు వివ‌రించారు.  కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానంపై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష నిర్వహించారు. కొత్త పాలసీ ప్రకారం ప్రీ ప్రైమరీ అంగన్ వాడీ విద్యకు, స్కూల్ విద్యకు మధ్యలో ఓ ఏడాది అనుసంధానం చేయాలని నిర్ణయించాం. పీపీ1, పీపీ2 తో పాటు మరొక ఏడాది పెంచుతున్నాం. హై స్కూల్ లెవెల్లో 3, 5, 8 తరగతుల్లో పరీక్షలు ఉంటాయి, అవి కేవలం వారి సామర్ధ్యాన్ని పరీక్షించడానికి మాత్రమే. 10 తరగతిలో బోర్డు పరీక్షలు యధావిధిగా ఉంటాయి. ఉన్నత విద్యను కూడా నైపుణ్యంతో ఉండేలా చర్యలు చేపట్టాం. మన రాష్ట్రం నుంచి చదువుకునే విద్యార్థులు అన్ని విధాలా సమర్థంగా ఉండేలా తీర్చి దిద్దుతామ‌ని మంత్రి సురేష్‌ పేర్కొన్నారు.  

Back to Top