మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పి.గన్నవరం చేరుకున్న సీఎం వైయస్ జగన్
16 Aug 2021 11:25 AM
తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కొద్ది సేపటి క్రితం తూర్పుగోదావరి పి.గన్నవరం చేరుకున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం వైయస్ జగన్ ప్రత్యేక హెలికాప్టర్లో పయనమయ్యారు. పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్లో ‘మనబడి నాడు-నేడు’ ద్వారా తొలి విడత పనులు పూర్తైన పాఠశాలలను సీఎం ప్రారంభించనున్నారు.
‘మనబడి నాడు-నేడు’ ద్వారా తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరించారు. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న సందర్భంగా వైఎస్ జగన్ వాటిని విద్యార్థులకు అంకితం చేయనున్నారు. అనంతరం రెండో విడత చేపట్టబోయే పాఠశాలల పనులకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుడతారు.
తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్న విద్యా కానుక’ రెండో విడత పంపిణీని రూ.731.30 కోట్లతో ప్రారంభిస్తారు. 8 పాఠశాల వద్ద ఉన్న భవిత కేంద్రం, గ్రంథాలయం, లేబొరేటరీలు పరిశీలించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను సీఎం జగన్ సందర్శిస్తారు. విద్యార్థుల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభిస్తారు. టాయిలెట్లను పరిశీలిస్తారు. అనంతరం నాడు-నేడు పైలాన్ను ఆవిష్కరించి, పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.