నేడు ఇడుపులపాయకు సీఎం వైయ‌స్‌ జగన్‌

2వ తేదీన వైయ‌స్సార్‌కు నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి  

అమరావతి: సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం వైయ‌స్సార్‌ జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు బయల్దేరుతారు. 5.16 గంటలకు ఇడుపులపాయలోని వైయ‌స్సార్‌ ఎస్టేట్‌కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి వర్థంతిని పురస్కరించుకుని 2వ తేదీ ఉదయం 9.45 గంటలకు వైయ‌స్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ్నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.30కి సీఎం వైయ‌స్‌ జగన్‌ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.  

తాజా వీడియోలు

Back to Top