తిరుపతి ఉప ఎన్నికలో చరిత్ర సృష్టిద్దాం

ఉప ఎన్నికల ఇన్‌చార్జ్‌ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి 

చిత్తూరు: తిరుపతి ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తి అత్యధిక మెజారిటî తో గెలిపించి చరిత్ర సృష్టిద్దామని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు, ప్రభుత్వ చీప్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం  సత్యవేడులో ఎమ్మెల్యే ఆదిమూలం ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ఉప ఎన్నికల ఇన్‌చార్జ్‌ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి హాజరయ్యారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం, వైయస్‌ఆర్‌సీపీకి మెజారిటీ అంశాలపై సమావేశంలో చర్చించారు.

Back to Top