అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం
 

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, మండ‌లి సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభ‌మ‌య్యాయి.  ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ వర్చువల్ విధానంలో మాట్లాడుతున్నారు.  గవర్నర్ ప్రసంగం అనంతరం, వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు.  ఈ సమావేశాలకు ముందుగా ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. ఈ భేటీలో బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. అసెంబ్లీలో ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండగా, శాసనమండలిలో హోమ్ శాఖామంత్రి సుచరిత వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.  

Back to Top