న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలను దెబ్బతీసే కుట్ర

ఆంధ్రజ్యోతి క‌థ‌నంపై  ప్ర‌భుత్వం సీరియ‌స్‌
 

అమరావతి: న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా, పక్కా వ్యూహంతో ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక త‌ప్పుడు  కథనం అల్లింద‌ని  రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని మీడియా సంస్థలు ఓ పక్కా వ్యూహంతోనే న్యాయ వ్యవస్థను పక్కదారి పట్టించేందుకు కుట్ర పన్నాయని అంచనాకొచ్చింది.  ‘న్యాయ దేవతపై నిఘా’ అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక తప్పుడు కథనంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌ అయింది. ఆ మీడియా సంస్థపై చట్టపరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తప్పుడు కథనంపై చట్ట ప్రకారం, న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలను ప్రారంభిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కథనంపై న్యాయ వ్యవస్థతో నేరుగా సంప్రదింపులు జరిపి దీని వెనుక కుట్రను వివరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.  

Back to Top