చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలను దెబ్బతీసే కుట్ర
15 Aug 2020 3:05 PM
ఆంధ్రజ్యోతి కథనంపై ప్రభుత్వం సీరియస్
అమరావతి: న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా, పక్కా వ్యూహంతో ఆంధ్రజ్యోతి దినపత్రిక తప్పుడు కథనం అల్లిందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని మీడియా సంస్థలు ఓ పక్కా వ్యూహంతోనే న్యాయ వ్యవస్థను పక్కదారి పట్టించేందుకు కుట్ర పన్నాయని అంచనాకొచ్చింది. ‘న్యాయ దేవతపై నిఘా’ అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక తప్పుడు కథనంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. ఆ మీడియా సంస్థపై చట్టపరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తప్పుడు కథనంపై చట్ట ప్రకారం, న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలను ప్రారంభిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కథనంపై న్యాయ వ్యవస్థతో నేరుగా సంప్రదింపులు జరిపి దీని వెనుక కుట్రను వివరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.