దాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఉత్తర్వులు
26 Aug 2020 6:23 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రానికి దరఖాస్తు చేసే బాధ్యతను ఏపీఐఐసీకి అప్పగించింది. అదే విధంగా ప్రైవేట్ పార్టనర్ని గుర్తించే బాధ్యతను అప్పగించడం సహా.. ఐఐసీటీ, సీఎస్ఐఆర్లతో నాలెడ్జ్ పార్టనర్లుగా ఎంవోయూ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా 2 వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ ఇటీవలే ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఏపీఐఐసీకి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీబీడీఐసీ) ఏర్పాటుకు అనుమతినిచ్చింది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా రానున్న ఎనిమిదేళ్లలో రూ.46,400 కోట్లు అమ్మకాలు జరుగుతాయని అంచనా. దాదాపు రూ.6940 కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనాలు ఉన్నాయి.