రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండ‌ర్ల ఆహ్వానం

విజయవాడ: రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఏపీ ప్ర‌భుత్వం టెండ‌ర్లు ఆహ్వానించింది.  ఈ నెల 27వ తేదీ నుంచి టెండర్లు స్వీకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారి చేసింది. జ్యూడిషియల్‌ పర్వ్యూ అనుమతితో టెండర్లకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈపీసీ విధానంలో 3278.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా  టెండర్లను ఆహ్వానించినట్లు అధికారులకు వెల్లడించారు.

19న టెండ‌ర్లు ఖ‌రారు
ఈ నెల13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అప్లీకేషన్‌లు స్వీకరించనున్నట్లు చెప్పారు.13న టెక్నికల్ బిడ్ తెరిచి, 17న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించి 19న టెండర్‌ను ఖరారు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.  శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటి మట్టం వద్ద రోజుకి 34,722 క్యూసెక్కుల నీరు ఎత్తిపోయడమే లక్ష్యంగా పథకాన్ని నిర్థేషించినట్లు అధికారులు తెలిపారు. 

Back to Top