ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అమ‌రావ‌తి:  ఐదో రోజు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 9 గంటలకు ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే టీడీపీ స‌భ‌లో స‌భ‌లో గంద‌ర‌గోళం చేశారు. ఏపీ అసెంబ్లీ 5 నిమిషాల పాటు వాయిదా పడింది. సభలో టీడీపీ సభ్యుల గందరగోళంతో స్పీకర్‌ వాయిదా వేశారు.శాసనమండలి 10 గంటలకు ప్రారంభం కానుంది. 10 గంటల నుంచి  శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు చేపడతారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగిస్తారు. అనంతరం బడ్జెట్‌పై చర్చ ప్రారంభమవుతుంది. 

Back to Top