మంగళగిరి: మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రభుత్వం మనది అని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మన ప్రభుత్వంలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా లబ్ధి జరిగింది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకం అమలు చేసిన సందర్భం ఉందా?. నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3706 కోట్లు ఖర్చు చేశాం. 1.06లక్షల మందికి లబ్ధి జరిగింది. గతంలో లంచాలు ఇస్తే కూడా సంక్షేమ పథకం అందని పరిస్థితి ఉండేదన్నారు. ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతామని సూచించారు. రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు విషయం జాగ్రత్తగా ఉండాలన్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్న చంద్రబాబు గతంలో చేసిన అన్యాయాన్ని గుర్తుచేసుకోవాలని సూచించారు. సీఎం వైయస్ జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర మంగళగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ చేనేత కార్మికులతో ముఖాముఖి అయ్యారు. సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. గత చంద్రబాబు పాలనను మీరు చూశారు. 58 నెలల కాలంలో మీ బిడ్డ పాలనను చూశారు. ప్రతీ పేదవాడి గుండెల్లో నిలిచేలా మీ బిడ్డ అడుగులు వేశాడు. 58 నెలల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల నుంచి వింటున్నాను. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలకు సూచనలు తీసుకుంటున్నాను. చంద్రబాబుకు ఉన్నంత నెగిటివిటీ అనుభవం నాకు లేదు. చేనేత కార్మికులను కూడా చంద్రబాబు మోసం చేశాడు. 2014లో కూటమిగా వచ్చి చంద్రబాబు ఏం చేప్పారో గుర్తు చేసుకోండి. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతాం. గతంలో 98 శాతం హామీలను ఎగ్గొట్టారు. 2 శాతం హామీలను మాత్రమే నెరవేర్చారు. గత పాలనకు, మన పాలనకు తేడాను మీరే గమనించారు. చంద్రబాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్నారు. గతంలో కూడా ముగ్గురు కలిసే వచ్చారు. ఒక్కరికైనా సెంట్ స్థలం ఇచ్చారా?. మనం స్థలం ఇస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. ఒక్క ఇళ్లైనా ఇచ్చారా?. చేనేత కార్మికులకు ఇల్లు, మగ్గం అని చంద్రబాబు మోసం చేశారు. నేతన్న నేస్తం పథకం కింద రూ.970కోట్లు చేనేత కార్మికులకు అందించాం. మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రభుత్వం మనది. కుల, మత, రాజకీయాలకు అతీతంగా లబ్ధి జరిగింది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకం అములు చేసిన సందర్భం ఉందా?. నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3706 కోట్లు ఖర్చు చేశాం. 1.06లక్షల మందికి లబ్ధి జరిగింది. గతంలో లంచాలు ఇస్తే కూడా సంక్షేమ పథకం అందని పరిస్థితి ఉండేది. దళారులు లేకుండా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాం. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేసిన ప్రభుత్వం మనది. ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలి. 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదు. వాలంటీర్ వ్యవస్థతో అవ్వాతాతలకు పెన్షన్ అందించిన ప్రభుత్వం మనది. పెన్షన్ను రూ.3వేలకు పెంచి అందించే అవకాశం నాకు వచ్చింది. 50 శాతం వెనుకబడిన వర్గాలకు టికెట్ ఇచ్చిన ఘనత మనదే. దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక రికార్డు. బీసీలు ఎక్కువగా ఉన్నా.. చంద్రబాబు బీసీలకు సీటు ఇవ్వలేదు. కుప్పంలో కూడా బీసీలే ఎక్కువ.. అక్కడా బీసీలకు టికెట్ ఇవ్వరు. మనం మాత్రం చేనేత వర్గానికి చెందిన చెల్లెమ్మెకు టికెట్ ఇచ్చాము. మంగళగిరిలో లక్షా 20వేల ఇళ్లున్నాయి. లక్షా 8వేల ఇళ్లకు నేరుగా సంక్షేమ పథకాలు అందించాం. 90 శాతం ఇళ్లకు లంచాలకు తావులేకుండా లబ్ధి జరిగింది. నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేసిన ప్రభుత్వం మనదిఅని తెలిపారు. పేదలకు మంచి జరిగితే అడ్డుకునే వాడు రాజకీయ నాయకుడా?. మేనిఫెస్టోలో చెప్పే ప్రతీ హామీని నెరవేర్చిన ప్రభుత్వం మనది. మంగళగిరిలో పేదలకు 54వేల ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబు అడ్డుకున్నాడు. కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేసి చంద్రబాబు అడ్డుకున్నాడు. మీ ఇళ్ల పట్టాలు అడ్డుకున్నది చంద్రబాబే. అందుకే ఓటు వేయమని అడిగినప్పుడు చంద్రబాబును నిలదీయండి’ అని సీఎం వైయస్ జగన్ కోరారు. చేనేత కార్మికులతో సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే.. 58 నెలల మన పాలనను మీరు చూశారు గత చంద్రబాబు పాలనను మీరు చూశారు నాయకుడి ఎన్నికలో పొరపాటు చేస్తే .. మనం చేసేదీ ఏమీ ఉండదు మనం తీసుకునే నిర్ణయం సరైంది అయితే, మన అడుగులు ముందుకు పడతాయి చంద్రబాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్నారు గతంలో కూడా ముగ్గురు కలిసే వచ్చారు మన ప్రభుత్వం నేతన్న నేస్తం కింద రూ.970 కోట్లు అందజేశాం చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించింది కుప్పంలో కూడా బీసీలే ఎక్కువ.. అక్కడా బీసీలకు ఇవ్వరు 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చాం ఎనిమిది మంది మున్సిపల్ చైర్మన్లు చేనేతలకు ఇచ్చాం 50 శాతం వెనుకబడిన వర్గాలకు టికెట్ ఇచ్చిన ఘనత మనదే దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక రికార్డు నామినేటెడ్ పదవుల్లోనూ చేనేత వర్గానికి ప్రాధాన్యతనిచ్చాం చేనేత వర్గం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వారికి అండగా నిలిచాం మంగళగిరి నియోజకవర్గంలో 90.1 శాతం లబ్ధి జరిగింది అక్కా చెల్లెమ్మలకు రూ.1530 కోట్ల లబ్ధి నాన్ డీబీటీ ద్వారా రూ.735 కోట్ల లబ్ధి టీడీపీ డబ్బు ఇస్తే తీసుకోండి ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించి ఓటు వేయండి మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నా నేతన్నల సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు చంద్రబాబు చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేశారు.. ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారు అప్కోకు కూడా చంద్రబాబు బకాయిలు పడ్డారు రెండు ఎమ్మెల్సీలు చేనేత వర్గానికే ఇచ్చాం మన ప్రభుత్వం నేతన్న నేస్తం కింద రూ.970 కోట్లు అందజేశాం రెండు ఎమ్మెల్యే సీట్లు కూడా ఇచ్చాం మంగళగిరిలో చేనేతలు ఎక్కువగా ఉన్నారని ఆర్కేతో మాట్లాడి ఒప్పించి ఇక్కడ సీటు చేనేత సామాజిక వర్గానికి చెందిన మహిళకు(లావణ్య) ఇచ్చాం బీసీలు ఎక్కువగా ఉన్న చంద్రబాబు సీటు ఇవ్వరు మంగళగిరిలో తన కొడుకు నారా లోకేష్కు ఇచ్చారు గతంలో ఎన్నడూ లేనంతగా.. మన ప్రభుత్వంలో నేతన్నల కోసం 3 వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేశాం మన సంక్షేమ పాలనలో 1.06 లక్షల మందికి లబ్ధి చేకూరింది 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదు ఇంటికి కేజీ బంగారం, బెంజీ కారు ఇస్తామని మోసం చేస్తారు ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారు మరోసారి రంగు రంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు ఒక్కరికైనా సెంట్ స్థలం ఇచ్చారా?.. పక్కా ఇంటిని కట్టించి ఇచ్చారా? గతంలో 98 శాతం హామీలను చంద్రబాబు ఎగ్గొట్టారు ప్రతి ఒక్కరి ఖాతాలో నగదు జమ చేస్తున్నాం వివక్ష లేకుండా, పార్టీలు చూడకుండా సంక్షేమం అందిస్తున్నాం అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ మేలు చేస్తున్నాం గతంలో పథకాలు అందాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి మన ప్రభుత్వంలో పెన్షన్ రూ.3 వేలు అందిస్తున్నాం నేను 14 ఏళ్లుగా సీఎం చేశానని చంద్రబాబు చెప్పుకుంటారు నేను ఆయనన్ని సార్లు సీఎంగా పని చేయకున్నా.. ఆయనంత నెగిటివిటీ అనుభవం మాత్రం లేదు మన బతుకుల్ని మార్చే నాయకుడినే ఎన్నుకోవాలి.. అలాంటి నాయకుడే సీఎం స్థానంలో ఉండాలి గత పాలకులకు, ఇప్పటి పాలనకు తేడా చూస్తున్నారు.. ఆ తేడాలు గమనించండి ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకపోతే మోసపోతాం