రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
భర్త చనిపోయి ఏళ్లు గడుస్తున్నా..
24 Jan 2018 12:09 PM
నెల్లూరు : కుటుంబానికి ఆధారమైన భర్త చనిపోయి ఏళ్లు గడుస్తున్నా అధికారులు వితంతు పింఛన్ మంజూరు చేయలేదంటూ ఆర్లపాడుకు చెందిన బండి రమణమ్మ వైయస్ జగన్మోహన్రెడ్డికి విన్నవించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పునబాక తూర్పు తట్టు కండ్రిగ నుంచి చెన్నప్పనాయుడుపేటకు పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్మోహన్రెడ్డిని ఆర్లపాడు క్రాస్రోడ్డు వద్ద వృద్ధురాలు రమణమ్మ కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. అర్హులందరికీ పింఛన్లు అంటూ ప్రగల్భాలు పలుకుతున్న పాలకులు కనీసం వితంతు పింఛన్ను కూడా మంజూరు చేయడంలేదని వాపోయారు. నాలుగు నెలలుగా వేలిముద్రలు సక్రమంగా నమోదు కావడం లేదంటూ రేషన్ సరుకులను కూడా ఇవ్వడం లేదని తెలియజేశారు. త్వరలోనే వైయస్ఆ ర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అందరికీ న్యాయం చేస్తామని వైయస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు.