ఈ ప్రభుత్వ హయాంలో ఏమేలూ జరగలేదు

పశ్చిమ గోదావరి: తెలుగుదేశం పార్టీ వచ్చిన తరువాత తనకు ఎలాంటి మేలు జరగలేదని రాధాకృష్ణ అనే దివ్యాంగుడు వైయస్‌ జగన్‌తో మొరపెట్టుకున్నారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలుసుకున్న దివ్యాంగుడు తన సమస్యలను చెప్పుకున్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తనకు పెన్షన్‌ వచ్చింది. లోన్‌ వచ్చింది.. ట్రైసైకిల్‌ కూడా ఇప్పించారన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తరువాత మూడు చక్రాల బండి కూడా ఇవ్వలేదన్నారు. వైయస్‌ జగన్‌ను కలిసి ఇల్లు ఇప్పించాలని కోరినట్లు చెప్పారు. ఇల్లు ఇప్పిస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారన్నారు. 
Back to Top