సంచార జాతులకు ఎమ్మెల్సీ ఇవ్వాలి



ప‌శ్చిమ గోదావ‌రి:  సంచార జాతులకు ఎమ్మెల్సీ, నామినేటేడ్‌ పదవులు, ప్రత్యేక గృహ నిర్మాణ పథకాన్ని ఏర్పాటు చేయాలని, రూ.500 కోట్లతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెండ్ర వీరన్న కోరారు. సంచార జాతుల వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని  ప్రజా సంకల్పయాత్రలో ఆ సంఘం నాయ‌కులు కలిసి వినతిపత్రాన్ని అందించారు.  ఉచిత విద్యా తదితర 9 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జననేతకు అందించారు.
Back to Top