వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
మీరూ మీ నాన్నలాగే మా క్షేమం తలచండయ్యా
26 Nov 2017 10:27 AM
కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకున్నారని మరోమారు రుజువైంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మహానేత అభిమానులు జననేతను కలిసి మహానేత చేసిన మేలులను గుర్తు చేసుకుంటున్నారు. ‘మీ నాన్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి గొర్రెలకు బీమా పథకం వర్తింపజేశారు. గొర్రెలకు వ్యాధులొస్తే ప్రభు త్వ పశు వైద్యశాలలో ఉచితంగా మందులు అందుబాటులో ఉంచారు. కానీ ఇప్పుడు గొర్రెల బీమా పథకాలకు మంగళం పాడారు. మీరూ మీ నాన్నలాగే మా క్షేమం తలచండయ్యా’ అని చెరుకులపాడుకు చెందిన గొర్రెల కాపరులు వైయస్ జగన్కు వినతిపత్రం ఇచ్చారు. తమకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలివ్వాలని కోరారు. మన ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా న్యాయం చేస్తానని వైయస్ భరోసా ఇచ్చారు. అనంతరం కాపరులు జననేత భుజంపై గొంగళి వేసి, గొర్రెపిల్లను బహూకరించారు.