అప్పు చేసి ఇల్లు నిర్మించుకున్నాం


పశ్చిమగోదావరి : అగ్ని ప్రమాదంలో మా ఇల్లు కాలిపోయింది. దీంతో కొత్త ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నాం. రోజులు గడుస్తున్నా ఇల్లు మంజూరైనట్టు అధికారులు చెప్పకపోవడంతో రూ.4 లక్షలు అప్పు చేసి ఇల్లు నిర్మించుకున్నామని పశివేదలకు చెందిన కోట వెంకటలక్ష్మి అనే మహిళ అదే గ్రామంలో వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి చెప్పారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి బిల్లుల కోసం దరఖాస్తు చేసుకున్నా సమాధానం చెప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బందులు పెడుతున్నారని ఆమె వాపోయారు. మీరు అధికారంలోకి రాగానే మాకు న్యాయం చేయాలని ఆమె కోరారు.
Back to Top