కాపులోన్లు ఇవ్వడం లేదు


 
పశ్చిమగోదావరి :  కాపుల‌కు రుణాలు ఇవ్వ‌డం లేద‌ని ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌లువురు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేశారు. కాపు సంఘం నాయ‌కులు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. అలాగే లంకలపల్లి శ్రీనివాస్‌ ఇటీవల నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ  వైయ‌స్ఆర్‌సీపీ తరఫున ఫ్లెక్సీలు వేశారని టీడీపీ నేతలు వేధిస్తున్నారని ఉప్పులూరు గ్రామానికి చెందిన లంకలపల్లి నాగదుర్గ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మా రేషన్‌ కార్డు తొలగించారు. ఇళ్ల స్థలం ఇవ్వడం లేదు. మా మావయ్యగారికి పెన్షన్‌ మంజూరు చేయడంలేదు.  నువ్వు వస్తేనే.. మా కష్టాలు తీరేద‌ని కోరారు.
Back to Top