చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతున్నారు
21 Apr 2018 12:29 PM
కృష్ణా జిల్లా : ‘అన్నా.. నాకు ముగ్గురు బిడ్డలు. నా భర్త చనిపోయి పదేళ్లవుతుంది. అప్పటి నుంచి నా కుటుంబాన్ని పోషించుకునేందుకు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. అయితే గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో నా కాలు విరిగిపోయింది. దీంతో కుటుంబ పరిస్థితి దారుణంగా తయారైంది’ అంటూ ఈదర ప్రాంతానికి చెందిన లక్కపల్లి విజయరాణి ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ను కలిసి కన్నీరుమున్నీరయ్యారు. కాలు విరగడం వల్ల ఏ పనికి వెళ్లలేకపోతున్నానని, ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించుకున్నా.. కాలు సరిగా బాగవ్వలేదని చెప్పారు. మళ్లీ చూపించుకోవాలన్నా, కాలులో ఆపరేషన్ సమయంలో వేసిన రాడ్డును తీయించుకోవాలన్నా ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతున్నారు. ఆరోగ్యశ్రీని మాలాంటి నిరుపేదలకు ఉపయోగపడేలా మార్పులు చేయాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.