ఇదెక్కడి న్యాయం అన్నా

చిత్తూరు:  అన్నా.. అసలే కష్టాల్లో ఉన్నాం. ఇప్పుడు కరెంట్‌ చార్జీలు మరింత ఇబ్బందిగా మారాయి. కోళ్లు మేపుతున్న మేము ప్రభుత్వం దృష్టిలో రైతులు కాదా?. మా కోళ్ల ఫారాలకు కమర్షియల్‌ కనెక్షన్ల పేరిట యూనిట్‌కు రూ.9.5 బాదేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం అన్నా’ అంటూ జిల్లాలోని కోళ్ల పెంపకందార్లు తమ ఆవేదన వెళ్లగక్కారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జననేతకు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో 1.6 లక్షల మంది కోళ్ల పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని, ఒక్కో కోడి పిల్లకు రూపాయి సబ్సిడీ ఇస్తే ఆదుకున్నట్టు అవుతుందని వివరించారు.

తాజా వీడియోలు

Back to Top