మ‌హానేత ఫొటోలు పెట్టుకున్నాన‌ని..

చిత్తూరు: ‘మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అన్నా, ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నా ఎంతో అభిమానం. వారి ఫొటోలు ఇంట్లో పెట్టుకున్నానని మా ఊరి టీడీపీ సర్పంచ్‌ కక్షగట్టి పింఛన్‌ రాకుండా చేస్తున్నారన్నా’ అని చిన్నగొట్టిగల్లుకు చెందిన దివ్యాంగుడు ఖాదర్‌వల్లీ ఆవేదన వ్యక్తంచేశాడు. ప్రజాసంకల్ప యాత్రలో జననేతకు తన కష్టాలు చెప్పుకున్నాడు. జన్మభూమి కార్యక్రమాల్లో వందలాది అర్జీలిచ్చినా, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు చేసినా పట్టిం చుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశాడు. తనకు తండ్రి కూడా లేడని కన్నీరు పెట్టుకున్నాడు. మనందరి ప్రభుత్వం వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని జననేత అతనికి భరోసా ఇచ్చారు.

తాజా వీడియోలు

Back to Top